పొడుగు కాళ్ళ బ్యూటీ పూజా హెగ్డే ఒక లైలా కోసం అనే సినిమాతో తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటూ టాప్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే పూజా హెగ్డే  మొదట గా నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. దీని తర్వాత అల్లుఅర్జున్ తో కలిసి దువ్వాడ జగన్నాథం సినిమాతో మంచి హిట్ ను సంపాదించి దూసుకుపోతుంది ఈ భామ. ఈ సినిమా తరువాత వరుసగా అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో  సినిమాలతో వరుస హిట్లతో అందుకని స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. ఈ సినిమాల తర్వాత తాజాగా అక్కినేని అఖిల్ తో కలిసి  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేమతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 వీరిద్దరు కలిసి నటించిన ఈ సినిమా కూడా మంచి హిట్ కావడంతో ప్రస్తుతం ఎంజాయ్ చేస్తోంది పూజ. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఒక శుభవార్త తెలియజేసింది. అదేంటి అంటే లెజెండ్ అయినా అమితాబ్ గారితో కలిసి వర్క్ చేయాలని అని వారితో కలిసి షూటింగ్ లలో పాల్గొనాలి అనేది తన కల అని చెప్పుకొచ్చింది. అయితే ఇన్నాళ్లు తన కల ఇవాళ నిజమైన అంటూ నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పింది. ఇన్నాళ్టికి అమితాబ్ గారితో కలిసి పని చేశానని ఇన్నాళ్ల తర్వాత నేను అనుకున్న కల అడిగిందని చాలా సంతోషపడుతుంది. ఇంక చాలు ఇప్పటికే చాలా చెప్పేసాను మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి అంటూ ఈ టాపిక్ ని అక్కడే ఆపేసింది.

 ఇలా చెప్తూ అమితాబ్ గారితో దిగిన ఒక బ్యూటిఫుల్ ఫోటోని అందరితో షేర్ చేసుకుంది పూజ. మై పూజా హెగ్డే అమితాబ్ గారితో కలిసి పనిచేయడం అంటే ఏంటి ఏదైనా  యాడ్ లో వీరిద్దరూ కలిసి ఇ నటించిన ఉన్నారా లేదా అమితాబ్ గారి పక్కన ఏదైనా సినిమాలో ఆఫర్ కొట్టేసిందా అనే విషయం ఇంకా తెలీదు. ఇకపోతే పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే వరుస హిట్లతో దూసుకుపోతుంది ఈ భామ. పూజా హెగ్డే రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం రాదే శ్యామ్ అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించారు. అయితే ఈ భామ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: