హాట్ బ్యూటీ రష్మి కెరియర్ ప్రారంభం లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వచ్చింది, ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయిన జబర్దస్త్ షో కు యాంకర్ గా వ్యవహరించి అనేక మంది బుల్లి తెర అభిమాను లను సంపాదించుకుంది. బుల్లితెర లో జబర్దస్త్ మాత్రమే కాకుండా అనేక షో లకు యాంకర్ గా వ్యవహరించిన ఈ ముద్దు గుమ్మ గుంటూరు టాకీస్  సినిమా లో హీరోయిన్ గా నటించి  యువత మనసు కొల్లగొట్టింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించకపోయినప్ప టికీ రష్మి గౌతమ్ అంద చందాలతో, నటనతో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇలా గుంటూరు టాకీస్ సినిమా తో తెలుగు కుర్రకారు మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది, కాక పోతే ఈ ముద్దు గుమ్మకు ఆ సినిమా లు ఏవి అనుకున్న రేంజ్ లో క్రేజ్ ను తెచ్చి పెట్టలేదు.

అలా చేసిన సినిమాలు ఏవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ఆకట్టు కోలేక పోయినపట్టికి టాలీవుడ్ లో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇలా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా లో ఒక అదిరిపోయే పాటకు కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా లో ప్రత్యేక పాట అంటే మామూలు విషయం కాదు, అలాంటి పాట కు రష్మి గౌతమ్ కి అవకాశం రావడం కూడా చిన్న విషయమేమీ కాదు, అయితే ఇప్పటి వరకు వెండితెర పై అనుకున్న రేంజ్ లో ఆకట్టు కోలేని ఈ ముద్దు గుమ్మ చిరంజీవి సినిమా తో మాత్రం  ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంటుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: