ఎప్పుడూ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హీరో అల్లరి నరేష్.. కానీ ఇప్పుడు రూటు మార్చి కొన్ని వైవిధ్యమైన పాత్రలను పెంచుకుంటూ విలక్షణమైన నటుడిగా పేరు పొందుతున్నాడు. అలా తాజాగా నాంది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా మంచి విజయాన్ని అందుకున్నాడు. కామెడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో విశాఖ ఎక్స్ప్రెస్, నాంది, గమ్యం వంటి చిత్రాలు వైవిధ్యమైన కథాంశాలని చెప్పవచ్చు.

తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఏది అల్లరి నరేష్ కెరీర్ లో 59 వ చిత్రంగా తెరకెక్కిన డం జరుగుతోంది. ఈ చిత్రాన్ని బతికే సో బెటర్, బంగార్రాజు అంటే మూవీస్ ఫుల్ సక్సెస్ ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ జి స్టూడియో నిర్మిస్తోంది. ఇక మర నిర్మాణ హాస్యం మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ డైరెక్టర్గా వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆనంది నటిస్తున్నది. నిన్నటి రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్రబృందం విడుదల చేయడం జరిగింది.

సినిమా పోస్టర్ విషయానికి వస్తే నరేష్ మంచం ఒక చివరన పట్టుకొని.. ముందుకు వెళుతున్నట్లు గా మనకీ కనిపిస్తోంది. అంటే ఎవరినో అల్లరి నరేష్ మోస్తున్నట్లుగా ఉందని చెప్పవచ్చు. ఇక తన చేతికి తలకి గాయాలు కూడా కనిపిస్తున్నాయి. నరేష్ ఒక ఇంటెన్షన్ లుక్ తో కనిపించడం ఈ పోస్టర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయండి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అల్లరి నరేష్ నాంది చిత్రం నుండి ఇలాంటి కథలనే ఎంచుకున్నట్లు గా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: