టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా. దేవదాసు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు అంతా సాఫీగానే సాగింది. రవితేజ హీరోగా చేసిన దేవుడు చేసిన మనుషులు చిత్రం వరకు ఆమె అగ్ర హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొనసాగింది. అయితే ఎప్పుడైతే ఆమె బాలీవుడ్ కి వెళ్లాలని కళలు కందో అప్పటి నుంచి ఆమెకు అవకాశాల పరంగా బ్యాడ్ లక్ ఎదురయ్యింది. అంతకుముందు ఆమెకు తెలుగు లో అవకాశాల మీద అవకాశాలు వచ్చేవి.

కానీ టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు వెళ్లి పెద్ద తప్పు చేసింది. ఆ విధంగా ఆమె బాలీవుడ్ లో చేసిన తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోగా ఇలియానా ఆ తర్వాత అదే జోరు ను మాత్రం కొనసాగించలేకపోయింది. ఆ విధంగా చేజేతులా ఆమె తన కెరీర్ ను నాశనం చేసుకుంది. అలా ఇప్పుడు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో రెండిట్లోనూ పెద్దగా రాణించడం లేదని చెప్పాలి. తెలుగులో ఆమధ్య రీ ఎంట్రీ గా చేసిన సినిమా రవితేజ అమర్ అక్బర్ అంటోనీ ఆమెకు కూడా హిట్ తెచ్చి పెట్టలేకపోయింది. 

సినిమా భారీ డిజాస్టర్ అవడం ఆమెను మరింత కష్టాల్లోకి వెళ్లేలా చేసింది. ఇకపోతే ఆమె బొద్దుగా మారడం కూడా మరిన్ని అవకాశాలు రాకపోవడానికి కారణం అయ్యింది. సన్నని భామగా చూసిన అందరు ఆమె ను బొద్దుగా స్క్రీన్ పై చూడలేకపోయారు.ఆమె తర్వాత మరింతమంది హీరోయిన్ లు వచ్చి తమ సత్తా చాటడంతో మెల్ల మెల్లగా ఆమె స్క్రీన్ పై కనపడడం తగ్గింది. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా లేకపోవడం అందరిని ఎంతో నిరాశపరుస్తుంది. కొంతమంది సినిమా విశ్లేషకులు అయితే ఆమె సినిమాలు ఇక చేయదనే అంటున్నారు. దాదాపు ఆమె కెరీర్ క్లోజ్ అయ్యిందనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: