బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ తెలుగులో ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ఇమే కెరియర్ టర్నింగ్ పాయింట్ మారుతుందని భావిస్తోంది. లేటు వయసు లో కూడా లేటెస్ట్ హిట్టుతో టాలీవుడ్ ను మెప్పిస్తానని ఈ ముద్దుగుమ్మ చాలా ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది. మొదటిసారిగా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను రెయిన్ బో చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత లెజెండ్, పండగచేస్కో, షేర్ తదితర సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.



అయితే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలన్నిటిలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మకు మెయిన్ హీరోయిన్ గా ఇంతవరకు ఎలాంటి అవకాశం రాలేదు. అలా రాకరాకు వచ్చిన అవకాశమే ది ఘోస్ట్ చిత్రం. ఈ సినిమాలో ఏమే నాగార్జున సరసన నటిస్తోంది. ఆయనతో పాటు ఈ ముద్దుగుమ్మ పలు యాక్షన్స్ సన్నివేశాలలో కూడా పోటీపడి నటిస్తున్నది. ఇంతవరకు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అవకాశం రాలేదు. ఇక బాలకృష్ణ తో కలిసి మూడు సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఘోస్ట్ సినిమా పై సోనాల్ చౌహాన్ చాలా ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది.


ఈ సినిమాతో మంచి హిట్ అందుకొని టాలీవుడ్లో బిజీ అవ్వాలని భావిస్తున్నది. మరి ఈ ముద్దుగుమ్మ అంచనాలు అందుకొని ఈ చిత్రం ఫలిస్తుందా లేదా అనే విషయం చూడాలి.ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా లో సోనాల్ చౌహన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో . ఇక ప్రభాస్  కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నది. మరి టాలీవుడ్ లో ఆశలన్నీ పెట్టుకున్న ఘోస్ట్ చిత్రం ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరి ఈ సినిమాతో ఈమెకు  సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: