గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ ,  తెలుగు , మలయాళం , కన్నడ ,  హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు  లభిస్తున్నాయి. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇలా గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఈ మూవీbకి దర్శకత్వం వహించడం ,  చియాన్ విక్రమ్ ,  కార్తి  , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించడం , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా తెలుగు  ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.71 కోట్ల షేర్ , 16.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను వసూలు చేసింది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే ఇంకా 1.79 కోట్ల షేర్ కలక్షలను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: