
ఇక అసలు విషయం లోకి వెళ్తే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని త్వరలోనే సినీ నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టబోతున్నాడట..ఈ క్రమం లో ఆయన ద్రుష్టి ఎక్కువగా సౌత్ స్టార్స్ మీదనే పెట్టినట్టు తెలుస్తుంది..అందుతున్న సమాచారం ప్రకారం మహేంద్ర సింగ్ ధోని అతి త్వరలోనే మహేష్ బాబు తో ఒక సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట..దీనికి సంబంధించి ఆయన మహేష్ బాబు తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది..మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఈ సినిమా హిందీ కి సంబంధించిన రైట్స్ మొత్తం ధోని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట..దానితో పాటు మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత చెయ్యబొయ్యే సినిమా కూడా ధోని ప్రొడక్షన్ హౌస్ నుండే ఉంటుందట..ఇది అభిమానులకు పండగ లాంటి వార్తే అని చెప్పొచ్చు..మరో పక్క ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం..గత కొద్దీ రోజుల క్రితం ధోని చెన్నై లో విజయ్ ని కలిసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన అలా కలవడానికి ముఖ్య కారణం ఇదేనట..క్రికెట్ రంగం లో దిగ్గజం గా నిలిచి ఎవ్వరికి సాధ్యపడని అనితర సాధ్యమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన ధోని..సినీ రంగం లో ఎలారాణిస్తాడో చూడాలి.