తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అల్లు శిరీష్ సరసన అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించింది. రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభించాయి.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగానే అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే డిసెంబర్ 9 వ తేదీ నుండి ఊర్వశివో రాక్షసివో  సినిమా ఆహా "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి. జీఏ 2 పిక్చర్స్‌, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్ రూపొందిన ఈ మూవీ లో వెన్నెల కిషోర్ ,  సునీల్ , ఆమని ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: