సందీప్ కిషన్ హీరోగా తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైఖేల్. రంజిత్ జయ కోడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి , వరుణ్ సందేశ్ , గౌతమ్ మీనన్ , వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ తదితర భారీ తారాగణం కీలకపాత్రలు పోషిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా కరెన్సీ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పీ, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై భరత్ చౌదరి పుష్కూర్ , రామ్మోహన్ రావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే యాక్షన్ తో పాటు రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా.. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు సినిమా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణసినిమా ట్రైలర్ ను  రిలీజ్ చేయగా తమిళంలో జయం రవి,  అనిరుధ్ రవిచంద్రన్ సంయుక్తంగా విడుదల చేశారు. అలాగే మలయాళం లో క్రేజీ హీరో నవీన్ పాలీ రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ తో కూడా అంచనాలను మరింతగా పెంచేశారు చిత్ర బృందం. కాకపోతే ఈ సినిమాలో కాస్త హింస ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో అంచనాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా మైకెల్ ట్రైలర్ తర్వాత వస్తున్న స్పందన చూసి దర్శకుడు రంజిత్ జయ కోడి పై భారీ ఆశలు కూడా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా మైకేల్ చిత్రం ఒక రిచ్ గా చిత్రీకరించబడిన యాక్షన్ త్రిల్లర్ మూవీ అన్నట్టుగా తెలుస్తోంది.  అంతేకాదు ఇందులో తుపాకీలు , ధైర్యం మరియు ప్రేమకు సంబంధించిన తీవ్రమైన భావోద్వేగాలతో కథను రూపొందించినట్లు తెలుస్తోంది.  ఇప్పటివరకు అడపాదడపా సినిమాలు చేస్తూ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కి  ఈ సినిమా ఊరట ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: