అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా నటి సయామీ నటించిన ఘూమర్ ట్రైలర్ను షేర్ చేసిన ఈయన నటిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ స్పందిస్తూ.. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది.మన మొదటి సినిమా రేయ్' నుంచి ఈ ప్రత్యేకమైన సినిమా 'ఘూమర్' వరకూ నీ ప్రయాణం అద్భుతంగా సాగింది. నీ ఓపిక, లక్ష్యానికి ఇది నిదర్శనం.
కెరియర్ పరంగా నీవు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఎంతటి ఆనందాన్ని అయితే పొందుతున్నానో నీ కుటుంబం కూడా అలాగే గర్వపడాలని ఆశిస్తున్నాను అంటూ సాయి ధరంతేజ్ తన మొదటి సినిమా హీరోయిన్ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె పలు తెలుగు సినిమాలలో నటించిన అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె నటించిన ఘూమర్ క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈసినిమాలో అభిషేక్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి