ప్రముఖ టాలీవుడ్ నటుడు ఆహుతి ప్రసాద్ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల సక్సెస్ లో ఆయన కీలక పాత్ర పోషించారు.ఆహుతి ప్రసాద్ కొడుకు కార్తీక్ మాట్లాడుతూ పెళ్లి అయ్యాక నాన్న మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి సినిమా ల్లోకి వచ్చారని కార్తీక్ తెలిపారు. ఆహుతి సినిమాలో ఆయన నటించారని మొత్తం 300 సినిమాలలో నాన్న చేశారని ఆయన చెప్పుకొచ్చారు.హీరోయిన్ ఫాదర్ రోల్స్ లో నాన్న ఎక్కువగా చేశారని కార్తీక్ అన్నారు. నాన్న కొన్ని సినిమా లలో విలన్ రోల్స్ లో కూడా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. స్కూల్ డేస్ సమయం లో మేము చెన్నై లో ఉండేవాళ్లమని ఆ తర్వాత హైదరాబాద్ కు మూవ్ అయ్యామని పేర్కొన్నారు. ఒక సినిమా కు నిర్మాత గా చేసి నాన్న డబ్బులు పోగొట్టుకున్నారని కార్తీక్ కామెంట్లు చేశారు. నిన్నే పెళ్లాడతా తర్వాత నాన్నకు వరుస ఆఫర్లు వచ్చాయని ఆయన అన్నారు.

నాన్న చనిపోయినా నాన్నను ఊహించుకుని పాత్రలు రాస్తున్నామని చాలా మంది చెబుతారని కార్తీక్ పేర్కొన్నారు. నాన్న అరుపుకే భయపడేవాళ్లమని కార్తీక్ కామెంట్లు చేశారు. అన్నయ్యకు చదువు విషయం లో నాన్న సూచనలు ఇచ్చేవారని కార్తీక్ చెప్పుకొచ్చారు. షూటింగ్ లేకపోతే నాన్న కార్డ్స్ ఆడేవారని కార్తీక్ అన్నారు. నాన్న రియల్ ఎస్టేట్ కూడా చేశారని ఆయన అన్నారు. నాన్న బ్రతికి ఉంటే రాజకీయాల్లో కి వచ్చేవారని కార్తీక్ పేర్కొన్నారు. నాన్నకు రెక్టల్ క్యాన్సర్ వచ్చిందని కార్తీక్ చెప్పుకొచ్చారు. క్యాన్సర్ వచ్చాక కూడా నాన్న సినిమా ల్లో కొనసాగారని కార్తీక్ వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత నాన్న 20 సినిమాలు చేశారని ఆయన అన్నారు. కార్తీక్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆహుతి ప్రసాద్ భౌతికంగా మరణించినా ప్రజల హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: