ఏపీ ఎన్నికల నేపథ్యం లో ప్రముఖ నటుడు, వైసీపీ నేత krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మళ్లీ యాక్టివ్ అయ్యారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ కు జనసేన కోసం 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వగా ఆ విరాళం గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ్ముడు మంచి వాడు అనుకుని చిరంజీవి విరాళం ఇచ్చారని పోసాని చెప్పుకొచ్చారు. చిరంజీవి విరాళం ఇచ్చే సమయానికి జనసేన ఖాళీ అయిపోయిందని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో మహిళా వాలంటీర్ల గురించి నీచంగా కామెంట్లు చేశారని పోసాని పేర్కొన్నారు. పవన్ మానసిక రోగి అని ఆయన చెప్పుకొచ్చారు.చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎవరూ నమ్మరని 2014 సంవత్సరానికి ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ హామీ లను అమలు చేయలేదని పోసాని పేర్కొన్నారు.జగన్ క్యారెక్టర్ చూసి జగన్ ను అభిమానిస్తున్నానని పోసాని తెలిపారు. చంద్రబాబు రోజు కో మాట మాట్లాడుతున్నారని ఏపీకి పురంధేశ్వరి లేడీ విలన్ లా తయారయ్యారని ఆయన కామెంట్లు చేశారు. పోసాని చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి పై చేసిన విమర్శలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ గా పని చేస్తున్న పోసాని మాటల తూటాలు బాగానే పేల్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పోసాని కామెంట్ల పై టీడీపీ, జనసేన నుంచి స్పందన వస్తుందేమో చూడాలి.  ఏపీ ఎన్నికలకు సరిగ్గా మరో 32 రోజుల సమయం మాత్రమే ఉండగా వరుస పర్యటనల తో రాజకీయ నేతలు ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ ప్రజల కోసం సరికొత్త హామీ లను ప్రకటిస్తూ వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పోసాని చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పోసాని కృష్ణ మురళి ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: