టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి పరిచయం అనవసరం. తాజాగా కోలీవుడ్ లో గోల్డెన్ క్వీన్ అవార్డ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్లామరస్ బ్యూటీ సమంత గోల్డెన్ క్వీన్ గా అవార్డు తీసుకున్నారు. అనంతరం సమంత మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకి నటుడు రాహుల్ రవీంద్రన్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన ఆరోగ్యం పరిస్థితి బాలేనప్పుడు రాహుల్ చూసుకున్నాడని చెప్పింది. ఉదయం నుండి సాయంత్రం వరకు తనతోనే ఉన్నాడని అంది. వారి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి తన పేరు పెట్టలేనని సామ్ తెలిపింది. రాహుల్ తనకు ఓ మంచి స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు అని చెప్పలేనని అన్నారు.

అలాగే ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపింది. తను గతంలో పడిన కష్టమే నేడు తనకు ఇంతమంది అభిమానులను తీసుకొచ్చి పెట్టిందని చెప్పుకొచ్చింది. తెలిసి తెలియక చాలా నిర్ణయాలు తీసుకుంటామని.. అవి మన కెరీర్ పై ప్రభావం చూపుతాయని సామ్ తన అభిమానులకు తెలిపింది. జీవితం పట్ల తీసుకునే ఏ నిర్ణయం అయిన బాగా ఆలోచించి తీసుకోవాలని సమంతా చెప్పుకొచ్చింది.

 
ఇకపోతే సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంతా రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సామ్ అంటే ఇష్టపడని వారుండారు. ఈ అందాల భామ గతంలో ఆరోగ్యం బాగలేక సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సమంతా మళ్లీ సినిమాలలో కనిపిస్తుంది. ప్రస్తుతం సమంత సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: