
సంక్రాంతి అంటే ఇప్పుడే కాదు.. ఒకప్పటి నుంచి థియేటర్ల వద్ద సినిమాలు సందడి కనిపించేది. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ పడేవారు. సాధారణ సమయంలో కంటే సంక్రాంతి హిట్ లే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇదే విధంగా 2001 సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. వెంకటేష్, చిరంజీవి, బాలయ్య.
ఇక చిరంజీవి హీరోగా " మృగరాజు " సినిమా విడుదల కాగా.. ఈ సినిమాకి గుణ శేఖర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టారు మేకర్స్. ఇక 2001 జనవరి 11న విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోని డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇదే రోజున బాలయ్య హీరోగా " నరసింహనాయుడు " సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకుంది. ఈ సినిమాకి 30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమాలో బాలయ్య చెప్పిన " కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా " అనే డైలాగ్ ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమా 19 థియేటర్లలో 175 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది . ఇక ఇదే సంక్రాంతికి హీరో వెంకటేష్ కూడా బరిలోకి దిగాడు. ఎమ్మెస్ రాజు నిర్మాణంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన" దేవి పుత్రుడు " సినిమాను జనవరి 14న విడుదల చేశారు. ఈ సినిమాలో భారీ గ్రాఫిక్ కారణంగా బడ్జెట్ కూడా ఎక్కువైందట . ఇక ఈ సినిమాకి ఏకంగా ఎంఎస్ రాజు కి 14 కోట్ల నష్టం వచ్చిందట . ఇక ఇలా 2001లో భారీ అంచనాల తో వచ్చిన చిరు, వెంకటేష్ లను .. కోల్కోలేని దెబ్బ కొట్టాడు బాలయ్య ..