వాట్ ..రెబల్ హీరో ప్రభాస్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా అనుకున్నారా..? కానీ మిస్సయిందా..? ఎందుకు ..?ఎలా..? ఎవరు వద్దన్నారు.. ప్రెసెంట్ ఇలాంటి క్వశ్చన్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారు నందమూరి అభిమానులు . సాధారణంగా ఇద్దరు బడా హీరోలు కలిసి నటించరు అని అందరూ అనుకుంటూ ఉంటారు.  కానీ అది జరుగుతుంది అంటూ ప్రూవ్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ ని మహేష్ బాబును తెర పై చూపించి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .


అయితే రాజమౌళి ఒక్క అడుగు ముందుకు వేసి బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్.. చరణ్ - ఎన్టీఆర్ లతో సినిమా తెరకెక్కించి సభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ మల్టీ స్టారర్ మూవీ రానే రాలేదు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ - తారక్ కాంబోలో ఓ  సినిమా రావాల్సి వుండింది అని .. కానీ ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు అని ఫ్లిం ఇండస్ట్రీలో ఉండే జనాలు మాట్లాడుకునేవారు.



సినిమా మరేంటో కాదు "బాద్షా". ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ . కాజల్ - ఎన్టీఆర్ మధ్య వచ్చే డైలాగ్స్ హైలెట్గా మారాయి . అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్ధ్ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు . నిజానికి స్పెషల్ క్యారెక్టర్ కోసం రెబల్ హీరో ప్రభాస్ ని అనుకున్నారట డైరెక్టర్.  కానీ ప్రభాస్ ఆ క్యారెక్టర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసారట. ఈ క్యారెక్టర్ ఆయనకు నచ్చకపోవడం పైగా సినిమాలో అది స్పెషల్ క్యారెక్టర్ కాదు కేవలం గెస్ట్ పాత్ర క్యారెక్టర్ కానీ రియలైజ్ అవ్వడం ఆయనను ఈ పాత్ర నుంచి తప్పించేలా చేశాయి అంటున్నారు జనాలు.  చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: