భారత్ ,పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఎక్కువ అవుతున్న తరుణంలో శాంతి చేకూర్చాలనే విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది.భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ నిన్నటి రోజున సాయంత్రం జరిగినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.. అయితే ఈ మేరకు ట్రంప్  ట్విట్టర్ నుంచి ఒకటి పోస్ట్ పెడుతూ కూడా ట్వీట్ చేశారు. ఒక రాత్రంతా ఇరువుదేశాలతో కూడా అమెరికా మాట్లాడిందని తాను రిక్వెస్ట్ చేసిన తర్వాతే రెండు దేశాలు సైతం కాల్పులను  విరమించుకోవడానికి అంగీకరించినట్లుగా తెలియజేశారు. కామన్ సెన్స్ మరియు తెలిపి ఉపయోగించినందుకు ఈ రెండు దేశాలకు అభినందనలు అంటూ తెలియజేయడం జరిగింది ట్రంప్.

అలా కాల్పుల విరమణ పైన దృష్టి పెట్టినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.. అయితే ఈ ట్విట్ పైన రాంగోపాల్ వర్మ తనదైన సెటైరికల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది.. అంటే నువ్వు చెప్పకుంటే మాకు కామన్ సెన్స్ గాని తెలివిగాని లేవా?.. నువ్వు వచ్చి మాకు అన్ని  నేర్పిస్తున్నావా అంటు ఒక సెటైరికల్ ట్విట్ వేశారు. ప్రస్తుతం వర్మ చేసినటువంటి ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ ట్విట్ పైన పలువురు నేటిజన్స్  సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.


అయితే పాకిస్తాన్ మాత్రం వక్రబుద్ధితో అన్ని నియమాలను అతిక్రమిస్తూ నిన్నటి రోజున డ్రోన్లతో మళ్ళీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలను భారత్ ఆర్మీ తెలియజేస్తూ వీటిని గుర్తించి మళ్లీ తిరిగి వాటన్నిటిని కూడా బ్లాస్ట్ చేసామని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మరింత నిజానికి దిగజారి అవకాశం ఉన్నదని అందుకే బోర్డర్లో ఉండేటువంటి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకి రాకూడదంటూ హెచ్చరించారు. మరి ఈ కాల్పుల విరమణ అనేది ఉంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: