ఇదివరకటి బాలయ్య వేరు .. ఇప్పటి బాలకృష్ణ వేరు .. సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఎంతో స్పీడ్గా దూసుకుపోతున్నాడు . ఓ సినిమా షూటింగ్ పై ఉండగానే రెండు మూడు సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు . ప్రస్తుతం ‘అఖండ 2’తో బిజీగా ఉన్న బాలయ్య మరోవైపు క్రిష్ , గోపీచంద్ మలినేని కథలకు ఓకే చెప్పేశాడు .. అలాగే జైలర్ 2 లో కూడా బాలయ్య కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి .. అయితే ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు అధిక్ ర‌విచంద్ర‌న్ కథకు కూడా బాలయ్య పచ్చ జెండా ఊపాడ‌న్న‌ది ఇన్సైడ్ వర్గాల టాక్ .. ‘మార్క్ ఆంటోనీ’, ‘గుడ్ బాడ్ అగ్లీ’ సినిమాలతో ఆకట్టుకున్నాడు ఈ కోలీవుడ్ డైరెక్టర్ . తనకు మాస్ పల్స్ బాగా తెలుసు ..


గుడ్ బాడ్ అగ్లీ తో అజిత్ ని చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది .. అలాగే తనకు బాలయ్య లాంటి మాస్ హీరో తగిలితే క‌థే వేరుగా ఉంటుంది అందుకే బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకోవడం వినిపించడం అన్ని చకచక జరిగిపోయాయి .. ఇక బాలకృష్ణ కూడా ఈ దర్శికుడుతో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగానే ఉన్నారు . అయితే ఇక్కడ కాకపోతే బాలయ్య లైన్ అప్ వచ్చే రెండేళ్లకు సరిపడా ఉంది .. ఇక వచ్చే జూన్‌లో గోపీచంద్ మలినెని సినిమాని మొదలు పెడతారు .. ఆ తర్వాత క్రిష్ సినిమా ఉండొచ్చని అంటున్నారు .. అలాగే ఈ రెండు సినిమాలని ఒకేసారి పూర్తి చేయాలన్నది బాలయ్య ప్లాన్ మధ్యలో జైలర్ 2 కి ఓకే చెబుతారు ..


ఈ సినిమాల తర్వాతే అధిక్  సినిమా ఉండొచ్చు గోపీచంద్ మలినేని సినిమా అని వీలైనంత త్వరగా పూర్తిచేసే అవకాశం ఉంది .  క్రీష్‌ సినిమా మాత్రం కొంత టైం పడుతుందని అంటున్నారు .  ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పేట వేసే స్టోరీ అట .. ఇక వీటికి తోడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆ సినిమాతోనే ఉండబోతుంది కాబట్టి ఆ సినిమాని ఎలాంటి కంగారు లేకుండా నిదానంగా పూర్తి చేయాలి. ఈలోగా హిందూపూర్ ఎమ్మెల్యే బాధ్యతలు , బసవతారకం పనులు ఉంటాయి .. వీటన్నిటికీ టైం కేటాయించాలి .  ఇప్పుడు కొలీవుడ్‌ దర్శకుడు క‌థ‌ని ఒకే చేసిన పట్టా లెక్కించడానికి టైం పెట్టే అవకాశాలు ఉన్నాయి .. కాకపోతే ఈ కాంబో ఎప్పుడు సెట్ అయిన క్రేజ్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: