
సాధారణంగా ఇద్దరు బిగ్ స్టార్స్ ని పెట్టి మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాలి అంటే కచ్చితంగా అభిమానుల దగ్గర నుంచి నెగిటివ్ రియాక్షన్స్ వస్తాయి. ఒక హీరోని ఎక్కువ చేసి చూపించిన మరొక హీరోని తక్కువ చేసి చూపించిన ..అసలు ఆ ఉద్దేశంతో డైరెక్టర్ అలాంటి సీన్స్ తెరకెక్కించకపోయినా మా హీరో తోపు అంటే మా హీరో తోపు అంటూ ఫ్యాన్స్ కొట్టుకొని చస్తారు . ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా అదే జరిగింది . చరణ్ ని హైలెట్ చేస్తూ తారక్ ని తొక్కేశాడు అంటూ రాజమౌళి పై నందమూరి ఫ్యాన్స్ ఆ టైంలో మండిపడ్డారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు.
అయితే ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే వీళ్ల కాంబోలో ఒక సినిమా రావాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు . ఆ సినిమా మరేంటో కాదు "ఎవడు". వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ గా కనిపించారు. నిజానికి ఆ పాత్ర గెస్ట్ అపీరియన్స్ గా రాసుకోలేదట . ఒక మల్టీస్టారర్ మూవీ గానే రాసుకున్నారట . అది కూడా ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారట . కానీ ఎన్టీఆర్ ఆ పాత్ర ని రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఆ పాత్రలోకి అల్లు అర్జున్ వచ్చాడు .
అయితే అల్లు అర్జున్ ఫిజిక్ కి అంత పెద్ద లెంతీ క్యారెక్టర్ సూట్ కాకపోవచ్చు అంటూ అది కాస్త గెస్ట్ పాత్రగా మార్చేసారట వంశీ పైడిపల్లి. ఎవడు సినిమా మంచి హిట్ అందుకుంది . శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించింది . కాజల్ అగర్వాల్ - అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో మెరిశారు. సోషల్ మీడియాలో అప్పట్లో ఎన్టీఆర్ - చరణ్ లని విడగొట్టడానికి అల్లు అర్జున్ ఈ మూవీ యాక్సెప్ట్ చేశారు అని వీళ్ళిద్దరి కాంబో సెట్ కాకపోవడానికి అల్లు అర్జున్ కారణమంటూ బాగా ట్రోల్ చేశారు . కానీ నిజం ఏంటంటే ఎన్టీఆర్ నే ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్ లో గెస్ట్ పాత్రలో సెలెక్ట్ అయ్యారు..!