
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రస్తుతం `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వెంకీ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమా కోసం వారం రోజులు పాటు వెంకీ కాల్షీట్స్ కూడా ఇచ్చారు.
ఆ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు. నాగ వంశీ నిర్మించబోయే ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. 2026 సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మలయాళ బ్లాక్ పాస్టర్ `దృశ్యం` సినిమాకు పార్ట్-3 రాబోతోంది. డైరెక్టర్ జీతో జోసెఫ్ మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీ లో అజయ్ దేవగన్ ముగ్గురితోనూ ఒకేసారి `దృశ్యం 3` చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ కూడా లాక్ అయింది.
దృశ్యం 3 అనంతరం వెంకటేష్, అనిల్ రావులపూడి కాంబినేషన్ లో `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకు సీక్వెల్ పట్టాలెక్కనుందని బలంగా టాక్ నడుస్తుంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని తీసుకురానున్నారని అంటున్నారు. అలాగే వెంకీ లైనప్ లో తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. అయితే వీరి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది క్లారిటీ కాలేదు.
ఇక వీటితో పాటే వెంకీ ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే `రానా నాయుడు` సిరీస్ తో వెంకీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ కోసం మరో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకటేష్ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.