
ఇక ఆ తర్వాత దాదాపు ఏడేళ్లు కలిసి ఉన్న ఈ జంట, ఇటీవల విడిగా జీవిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సైనా మాటలతో వాటికి తుదితీర్పు లభించింది . ఇటీవల కాలంలో సైనా ఫిట్నెస్ ఇష్యూలు కారణంగా టోర్నీల్లో నుంచి విరమించగా, కశ్యప్ ఆటకు గుడ్బై చెప్పి కోచింగ్ రంగంలోకి ప్రవేశించారు. వృత్తిపరంగా మారుతున్న మార్పులు, వ్యక్తిగత విభేదాలు, టైమ్ మేనేజ్మెంట్ ఇబ్బందులు వీరి మధ్య దూరం పెరగడానికి కారణమై ఉంటాయనే ఊహలు వినిపిస్తున్నాయి.తెలుగు క్రీడా రంగానికి చెందిన బ్యాడ్మింటన్ ప్రేమ జంటల్లో ఇదే మొదటిసారి కాదు. గుత్తా జ్వాలా – చేతన్ ఆనంద్ ప్రేమించి , 2005లో పెళ్లి చేసుకొని, 2011లో విడిపోయారు.
అయితే ఇప్పటికీ ఇద్దరూ తమ జీవితాల్లో కొత్త అడుగులు వేశారు. గుత్తా జ్వాలా ఇటీవల తమిళ నటుడు విష్ణు విశాల్తో వివాహం చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు సైనా – కశ్యప్ కూడా అదే దారిలో నడిచారు. ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్కు బలమైన జోడీగా నిలిచిన వీరి విడాకుల కథ అభిమానులను బాధలో ముంచుతుంది. ప్రేమను పెళ్లిగా మార్చుకున్నా, జీవిత ప్రయాణం మాత్రం చివరి వరకు ఒకే దారిలో నడవలేదనేది ఈ జంట కథలో తీపి చేదుల సమ్మేళనం.