
కాకపోతే దర్శకత్వ బాధ్యతలను వశిష్ఠ కాకుండా కొత్త దర్శకుడు అనీల్ పదురీ తీసుకున్నారు. కళ్యాణ్ రామ్తో గొడవలు కారణంగా వశిష్ఠ బింబిసార 2 నుంచి తప్పుకున్నారని గతంలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. వశిష్ఠ మాట్లాడుతూ.. బింబిసార 2 కి అనీల్ పదురీ మంచి కథ రాశాడు. నాకన్నా బెటర్ గా మంచి ఐడియా క్రాక్ చేసాడు. దాంతో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే సెట్ అవ్వదనిపించింది.
అనీల్ నా కంటే బెటర్గా తీస్తాడనే నమ్మకం నాతో పాటు కళ్యాణ్ రామ్ కు కూడా వచ్చింది. అతడే బెటర్ అని ఇద్దరం కలిసి ఫిక్స్ అయ్యాకే బింబిసార 2 నుంచి నేను తప్పుకున్నా` అంటూ చెప్పుకొచ్చాడు. అంతే తప్ప తనకు, కళ్యాణ్ రామ్ కు ఎటువంటి గొడవలు లేవని వశిష్ఠ స్పష్టం చేశాడు. త్వరలోనే బింబిసార 2 సెట్స్ మీదకు వెళ్లబోతుందని కూడా తెలిపారు. కాగా, వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `విశ్వంభర` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు