తెలిసి చేశాడో, తెలియక చేశాడో తెలియదు కానీ తమిళనాడు డైరెక్టర్ మురుగదాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు జనాలను మండిపడేలా చేశాయి. మురుగదాస్ అంటే కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు, తన పని చేసుకుని వెళ్ళిపోతారు అనే ఇమేజ్ ఉంది. గతంలో నయనతార మాత్రం మురుగదాస్‌పై ఒక సంచలన కామెంట్ చేసింది. "గజినీ సినిమాను ఒకలా చెప్పి  మరొకలా తెరకెక్కించాడు. అందువల్ల నా రోల్ పెద్దగా హిట్ కాలేకపోయింది," అంటూ చెప్పింది. ఆ విషయాన్ని అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ సమయంలో మురుగదాస్‌కి క్రేజ్, పాపులారిటీ అన్నీ ఎక్కువగా ఉండేవి.


కానీ ఇప్పుడు ఆ క్రేజ్ అంతగా లేదు. తాజాగా మురుగదాస్ తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్‌పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. "మా తమిళ దర్శకులే గొప్పవారు," అన్నట్టుగా ఆయన ప్రసంగించారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆయన మాట్లాడుతూ "చాలా మంది దర్శకులు వెయ్యి కోట్ల క్లబ్ అంటూ పాకులాడతారు. ఆ క్లబ్‌లో చేరేందుకు మాత్రమే ఆసక్తి చూపుతారు. వాళ్లు కేవలం జనాలను ఎంటర్‌టైన్ చేసేందుకే సినిమాలు తీస్తారు. కానీ మా తమిళ దర్శకులు మాత్రం ప్రజలకు ఉపయోగపడే సినిమాలనే తీస్తారు. మేము 100 కోట్లు, 1000 కోట్లు గురించి ఆలోచించం. సామాజిక కోణంలో ఆలోచించి సినిమాలు చేస్తాం. ప్రజలకు జ్ఞానం పెంచేలా, ప్రభావితం చేసేలా తీస్తాం," అంటూ కామెంట్ చేశారు.



ఇలా చెప్పడంతో ఒక్కసారిగా మురుగదాస్‌పై సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. "తెలుగు డైరెక్టర్లు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే సినిమాలు తీస్తారా? ప్రజలను ఉద్దేశించి, జ్ఞానం పెంచేలా సినిమాలు చేయరా?" అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులూ ఫైర్ అవుతున్నారు. చూస్తుంటే మురుగదాస్‌కి ఇకపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఎవరూ కూడా ఛాన్స్ ఇవ్వరని స్పష్టమవుతోంది. దీనిపై టాలీవుడ్ హీరోలు సీరియస్‌గా స్పందించాలి అంటూ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: