సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం ఆగడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా హీరోయిన్గా నటించగా ... శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సోను సూద్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కంటే ముందు మహేష్ బాబు , శ్రీను వైట్ల కాంబోలో దూకుడు అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయం సాధించడంతో ఆగడు సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 2014 వ సంవత్సరం సెప్టెంబర్ 19 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 11 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 11 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా మొదలు అయ్యే ముందు జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా ఆగడు సినిమా దర్శకుడు అయినటువంటి శ్రీను వైట్ల మాట్లాడుతూ ... మహేష్ బాబు గారితో నేను మొదట రూపొందించిన దూకుడు సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన నాకు మరో సినిమా చేసే అవకాశం కూడా ఇచ్చాడు. దానితో నేను ఒక కథను రెడీ చేశాను. అది అద్భుతంగా వచ్చింది. దానిని మహేష్ బాబు గారికి వినిపించాను. ఆయనకు కూడా అది అద్భుతంగా నచ్చింది. కానీ మా నిర్మాత మాత్రం ఆ సమయంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాడు. నేను మహేష్ బాబు కోసం రాసుకున్న కథకు భారీ బడ్జెట్ అవసరం ఉంటుంది. దానితో మహేష్ గారు కూడా అంత బడ్జెట్ తో అవసరమా ..? నిర్మాత కష్టాల్లో ఉన్నాడు అని అన్నాడు. దానితో నేను సింపుల్ గా ఓ కథ రెడీ చేశాను ... అదే ఆగడు. ఆ మూవీ ని ఎంతో ఇంట్రెస్ట్ గా తీశాను. కానీ జనాలకు నచ్చలేదు. నేను కాస్త కష్టం అయినా మొదట అనుకున్న స్టోరీ తో సినిమా తీసుకుంటే అద్భుతమైన విజయం సాధించి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను అని శ్రీను వైట్ల ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: