సినీ పరిశ్రమ అంటే కేవలం నటులు మాత్రమే ఉంటారనుకుంటే పొరబాటే కానీ ఇక్కడ బంధాలు, అనుబంధాలు అనేవి కూడా ఉంటాయి. టాలీవుడ్ పరిశ్రమ రూపు రేఖలు మార్చిన వారిలో  సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు కూడా కూడా ఒకరు , అలాంటి ఏఎన్నార్ , ప్రముఖ ప్రొడ్యూసర్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత అనుమోలు వెంకట సుబ్బారావు వియ్యంకులుగా మారారు . మొదటిసారి ఏఎన్ఆర్ తో ఏవీ సుబ్బారావు నిర్మించినటువంటి మొట్టమొదటి చిత్రం" ఇల్లరికం"1959లో నిర్మించి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ తో పునర్జన్మ, భార్యాభర్తలు, కుల గోత్రాలు, నవరాత్రి, బ్రహ్మచారి, పల్లెటూరి బావ మరికొన్ని చిత్రాలను నిర్మించారు ఏవి సుబ్బారావు. ఇలా ఎన్నో చిత్రాలను నిర్మించి ఏఎన్ఆర్ పర్మినెంట్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించారు ఏవీ సుబ్బారావు.


ఆ తర్వాత 1974లో వీరు వియ్యంకులుగా మారారు. ఏవీ సుబ్బారావు కుమారుడు సత్య భూషణరావు, ఏఎన్ఆర్ రెండవ కుమార్తె నాగసుశీల వివాహం 1974 జూన్ 10వ తేదీన జరిగింది. అప్పట్లోనే మద్రాసులోని అబట్స్ బరీ ప్రాంతంలో చాలా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి, ఏఎన్ఆర్ కు బెస్ట్ ఫ్రెండ్స్ తమిళ స్టార్ హీరో శివాజీ గణేషన్, మాజీ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. నాగసుశీల, సత్య భూషణ్ కి పుట్టిన కుమారుడే ఇప్పటి యంగ్ హీరో సుశాంత్. 50 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లికి సంబంధించి అప్పట్లో ప్రచురించిన ఒక ఫోటో  కూడా వైరల్ గా మారుతోంది.




ఏవీ సుబ్బారావు, ఏఎన్ఆర్ వియ్యంకులు అయిన తర్వాత  వీరి కాంబినేషన్లో వచ్చిన ఆలుమగలు చిత్రం 1977 మంచి విజయాన్ని అందుకున్నది. మళ్లీ ఏఎన్ఆర్ తో నాయకుడు - వియ్యంకుడు అనే చిత్రాన్ని 1980లో నిర్మించారు.1965లో జయలలిత మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైన చిత్రం మనుషులు- మమతలు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది జయలలిత. జయలలిత చివరి సినిమా నాయకుడు - వీయకుడు చిత్రాన్ని కూడా ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్ నిర్మించింది. ఇందులో హీరోగా ఏఎన్నార్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: