టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరు పొంది తేజ సజ్జా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా ఎన్నో చిత్రాలలో నటించి ఇప్పుడు హీరోగా భారీగా క్రేజీ సంపాదించారు. జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ సంపాదించారు. ఒక్కో సినిమా ఊహించిన దాని కంటే భారీగానే కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో తేజ సజ్జా  సినిమా కొన్న బయ్యర్లు కూడా లాభాలను పొందారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ సినిమాలు కావడమే కాకుండా, హాలీవుడ్ రేంజ్ లో సినిమాలను చూపిస్తూ ఉండడంతో ప్రేక్షకులు కూడా తేజ సజ్జా చిత్రాలకు ఫిదా అవుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే తేజ సజ్జా చిత్రాలకు బంపర్ ఆఫర్ తగిలినట్లుగా కనిపిస్తోంది. గతంలో జాంబిరెడ్డి 2 తీయబోతున్నామంటూ చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది.



అయితే ఈ సినిమా ఇప్పటివరకు ఇంకా సెట్స్ మీదకే వెళ్లలేదు. కానీ జాంబిరెడ్డి 2 చిత్రానికి సంబంధించి ఓటిటి బిజినెస్ మాత్రం పూర్తి అయినట్లుగా వినిపిస్తోంది. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి రూ .42 కోట్ల రూపాయల డీల్ సెట్ అయినట్లుగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పెద్దపెద్ద హీరోల చిత్రాలకే ఓటిటి సంస్థలు ఇంత ధరకు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాకముందే రూ .42 కోట్ల బిజినెస్ ఓటిటి బిజినెస్ జరగడంతో తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


దీంతో తేజ సజ్జా రేంజ్ పెరిగిపోయిందని సినిమాలు విడుదల కాకముందే ఓటిటి డీల్స్ తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అలాగే హనుమాన్ 2 , మిరాయ్ 2 సినిమాలు కూడా ఉండనున్నాయి. మరి ఈ సినిమాలు కూడా భారీ ధరకే ఓటిటి డీల్స్ పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: