నాగచైతన్య నాగార్జున వారసుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆయన ఈమధ్యనే పదేళ్ళ కెరీర్ని పూర్తి చేసుకున్నారు. అందులో  హిట్లు, ఫట్లు సంగతి పక్కన పెడితే చైతూలో హీరో మెటీరియల్ ఉందని ప్రూవ్ అయింది. ఆయన కొన్ని రకాల పాత్రలకు బాగా సూట్ అవుతాడని కూడా పేరొచ్చింది. చైతూ యాక్షన్ మూవీస్ ని పక్కనపెట్టి రొమాంటిక్,  ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసుకుంటే ప్రామిసింగ్ హీరోగా పది కాలాలు నిలిచిపోతాడని కూడా అంటున్నారు.


చైతూ ఇపుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మూవీని చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్. ఫిదా వంటి పెద్ద హిట్ కొట్టిన తరువాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబో అంటే మంచి మూవీ వస్తోందన్న అంచనాలు ఉన్నాయి. సో చైతు చేతిలో కచ్చితమైన హిట్ ఒకడి పడబోతోందని అంటున్నారు. ఇదిలా ఉండగా చైతూకు మరిన్ని ఆఫర్లు కూడా ఉన్నాయట.


అందులో ఇంటెరెస్టింగ్ ఆఫర్ ఏంటి అంటే అందాల తార శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారట. ఆయన చేసే ఫస్ట్ మూవీ చైతూతోనేనని అంటున్నారు. నాగార్జున కుటుంబంతో శ్రీదేవి బోనీ కపూర్లకు మంచి సంబంధాలు  ఉన్నందువల్ల తొలి సినిమా చైతూ హీరో పెట్టి బోణీ కొట్టాలని బోనీకపూర్  అనుకుంటున్నారుట.


దీంతో చైతూకి మంచి ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. మరి బోనీ కపూర్ ఈ మూవీ వరకూ నిర్మాతగానే ఉంటారా లేక హీరోయిన్ తండ్రిగా మారి జాన్వీకపూర్ కి  కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇప్పిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా బోణీ తెలుగులో మూవీ చేయడం గ్రేట్ అనుకుంటే నాగ్ ఫ్యామిలీ నుంచి రొమాంటిక్ హీరోగా చైతూని ఎంచుకోవడం మరో విశేషం. మొత్తం మీద చూసుకుంటే ఈ మూవీ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: