అయితే ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా తనను తుది జట్టు నుంచి తప్పించడం విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా ఓపెనర్ బ్యాట్స్మెన్ పృద్వి షా . జట్టులో నుంచి నన్ను తొలగించారు అని తెలియ గానే ఏకంగా గది లోకి వెళ్లి ఎంతగానో ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. జట్టు లో లేను అన్న విషయాన్ని తెలియగానే ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాను..నాకు నేనే ఒక పనికిమాలిన వాడి గా కనిపించానని అంటూ చెప్పుకొచ్చారు.
అయితే గతంలో వరుసగా విఫలమవుతున్న దాన్ని చూసి ఏదో తప్పు జరుగుతుంది అని గ్రహించాను దాన్ని సరి పెట్టు కోవాలి అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు పృద్వి షా. అయితే ఆస్ట్రేలియా పర్యటన లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న పృద్వి షా ఆశించిన స్థాయి లో రాణించ లేక పోవడంతో ఇక ఆ తర్వాత జట్టు నుంచి తొలగించారు. కానీ ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో ప్రదర్శన అదరగొట్టాడు. సెంచరీల సెంచరీలు కొడుతూ తన సత్తా నిరూపించుకున్నాడు.