ఈ మద్య ప్రధాన నగరాల్లో హైటెక్ వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంది.  డబ్బు సంపాదించడం కోసం కొంత మంది దళారులు యువతులను పావుల్లా వాడుకుంటున్నారు.  ఇందుకోసం గ్రామాల నుంచి వచ్చిన యువతులను, కాలేజీల్లో చదువుతూ డబ్బు అవసరం ఉన్న అమ్మాయిలను..జల్సాకు అలవాటు పడిన అమ్మాయిలను తమ ఉచ్చులోకి లాగి విటులను రప్పించుకొని వారి నుంచి అడ్డగోలుగా డబ్బులు లాగుతున్నారు.  ఇందుకోసం అపార్ట్ మెంట్స్ లో గుట్టుగా వ్యభిచారాలను కొనసాగిస్తున్నారు.  అయితే ఇందులో కొంత మంది మహిళలు కూడా ఉండటం విచారకరం. 

ఇక పెద్ద పెద్ద నగరాల్లో బ్యూటీ పార్లర్, స్పా సెంటర్‌ ముసుగులో యథేచ్ఛగా జరుగుతున్న వ్యభిచారం జరగుతుంది.  ఇప్పటికే పలుమార్లు పోలీసులు ఇలాంటి సెంటర్లపై ఎన్నో దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నా..వీరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా  స్పా సెంటర్‌ ముసుగులో యథేచ్ఛగా జరుగుతున్న వ్యభిచార దందాకు హైదరాబాద్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. 

నగర పరిధిలోని ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్ లో 'స్టూడియో మేకర్స్ స్పా సెంటర్‌'లో గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు కొంత మంది యువతులను అక్కడకు తీసుకు వచ్చి వారితో క్రాస్ మసాజ్, వ్యభిచారం చేయిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. 

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్పా సెంటర్‌  పై ఒక్కసారే దాడి చేశారు.  స్పా సెంటర్ లో ఆరుగురు సిబ్బంది, ముగ్గురు యువతులు పట్టుబడగా, వారిని అదుపులోకి తీసుకుని స్పాను సీజ్ చేశారు. పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించామని, పరారీలో ఉన్న స్పా సెంటర్ యజమాని సతీష్ కోసం గాలిస్తున్నామని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: