పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఉంది చంద్రబాబు వరస. జగన్ ఎం చేసిన చంద్రబాబు కి నెగటివ్ గానే కనిపిస్తుంది అందుకే జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు జాగ్రత్త అంటూ పార్టీ నాయకులను టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారంట. ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టెక్నాలజీని బాగా వినియోగించే చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో టచ్‌లోనే ఉంటున్నారు. 


ఈ క్రమంలో ఆయన తాజాగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు, జాగ్రత్త అంటూ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇందుకు కారణం జగన్ ప్రచారం ఆపేసి ఒక రోజంతా లోటస్ పాండ్‌లోనే గడపడం. ఇంతకీ జగన్ ఏం చేశారంటే సోమవారం ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా లోటస్ పాండ్‌కి వెళ్లారు.


మంగళవారం ప్రచారం కొనసాగించకుండా విశ్రాంతికి ప్రాముఖ్యతనిచ్చారు.అయితే ఆ సమయంలో పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా స్థానిక నాయకులతో సమీక్షలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచార వివరాలను తెలుసుకొని వాటిని సమీక్షించారు.ఈ నేపథ్యంలో జగన్ ఒక రోజంతా పూర్తిగా ప్రచారానికి దూరంగా ఉండటంతో ఏదో కుట్రకు ప్లాన్ చేస్తున్నారు జాగ్రత్త అంటూ పార్టీ నాయకులకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదం.

మరింత సమాచారం తెలుసుకోండి: