ప్రధాని మోడీ నాతో ఫోన్ లో మాట్లాడారు.. కరోనాను ఎలా కట్టడి చేయాలని అడిగారు. నేను ఈ మధ్య కనిపెట్టిన విషయాలను ఆయనతో పంచుకున్నాను. ఆయనకు చాలా సలహాలు ఇచ్చాను. ఆయన చాలా థాంక్స్ అంటూ మెచ్చుకున్నారు..ఇలా మొన్న చంద్రబాబు చాలా ఖుషీగా మీడియా ముందు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన నుంచి ఫోన్ రావడమే మహాభాగ్యమని పొంగిపోతున్న తీరుపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
తమ క్రియేటివిటీ అంతా ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక నెటిజన్ కొంటెగా.. ఏం కామెంట్ పెట్టాడంటే.. "ప్చ్...భువనేశ్వరి ఉత్త అమాయకురాలు. బాబు గారికి నిద్రాభంగం కలిగించారు. ఆమె ఆ తప్పు చేయకపోయి ఉంటే ప్రధాని మోడీతో బాబు ఇంకా ఎక్కువ సేపే మాట్లాడే వాడు" అని సెటైర్ పేల్చాడు.
మరో నెటిజన్.. "నేను చెబితే విన్నారా...బాబు చెప్పాడని చెప్పాగా. గ్రీన్, ఆరెంజ్, రెడ్జోన్లు పెట్టాలని బాబు చెప్పాడు. కానీ మోడీ గారు విజయవాడను కాల్మనీ, ఎల్లో జోన్గా మారుస్తానని చెప్పాడు. దీనిమీద బాబుకు ప్రధాని ఫోన్ చేసి చెప్పాడు. నమ్మాలి మీరందరూ" అంటూ చంద్రబాబుకు చురకలు వేశారు. ఇంకో నెటిజన్ ఇంకాస్త ముందుకెళ్లి.. "ఒక్క మోడీ గారేనా లేక ట్రంప్,ఒబామా, క్లింటన్ కూడా ఫోన్ చేసి మాట్లాడి నట్లు అనిపిస్తోందా? ఎప్పటి నుండి ఇలా అనిపిస్తోంది"...అంటూ వెటకారం ఆడారు.
ఇంకొందరేమో.. "అబ్బా ఇంకా రాలేదే అనుకుంటున్నాం. ఎట్టకేలకు దిగిపోయాడండి" అని... "ఈయనగారి ఫోన్ను రిసీవ్ చేసుకోడానికి పీఎం కార్యాలయంలో కనీసం ఆఫీస్ బాయ్ కూడా సిద్ధంగా లేడు" అని ఇంకొకరు పోస్టులు పెట్టారు. ఇంకొందరేమో కామెంట్ల ద్వారా కాకుండా.. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి వంటి కమెడియన్ల ఫోటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. పాపం.. చంద్రబాబు.