దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ ఇటీవలే అసలు నిజం బయట పడడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు నిజం బయటికి రావడంతో ఏడాది క్రితం అదృశ్యమైన నలుగురు కుటుంబసభ్యులు అస్తిపంజరాలుగా కనిపించారు. దారుణ ఘటన ఉత్తరాఖండ్ లో వెలుగులోకి వచ్చింది. ఉద్దమ్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన హీరాలాల్ అతడి భార్య ఇద్దరు కుమార్తెలు గతేడాది ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయారు. అయితే ఇటీవలే హీరాలాల్ అల్లుడు నరేంద్ర ఇటీవలే చనిపోయినవారి మరణ ధ్రువీకరణ పత్రాల కోసం... హీరాలాల్ స్నేహితున్ని సంప్రదించారు.
దీంతో నరేంద్ర గంగ్వార్ పై అనుమానం కలిగింది హీరాలాల్ స్నేహితుడికి. దీంతో వెంటనే అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నరేంద్ర ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో సంచలన నిజాలు బయట పడ్డాయి. భూమి కోసం తన మామను వారి కుటుంబ సభ్యులను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు హీరాలాల్ అల్లుడు నరేంద్ర. తన మిత్రుడితో కలిసి ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాలను ఆ ఇంటి ప్రాంగణంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టినట్లు తెలిపాడు. దీంతో షాకైన పోలీసులు నిందితులను అరెస్టు చేసే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి