తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలు వైయస్ షర్మిల ప్రకటించడం సంచలనం కూడా మారిపోయింది. అయితే ఇటీవలే పార్టీ ప్రకటన తేదీని కూడా ప్రకటించారు వైయస్ షర్మిల. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీ ఏర్పాటుకు సంబంధించి అంతా సిద్ధం చేసుకుంటున్నారు వైయస్ షర్మిల. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన వైయస్ షర్మిల పాత మిత్రులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే పలువురు తో మంతనాలు కూడా జరుపుతున్నారు వైయస్ షర్మిల. అయితే ఇక తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఉన్న కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు వైయస్ షర్మిల. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దేవుడిచ్చిన చెల్లెలు గా ఉండేవారు కొండ సురేఖ.. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో కూడా మంచి అనుబంధమే ఉంది వీరికి. ఇలాంటి వీరిని అటు తన పార్టీలోకి ఆహ్వానించాలని వైయస్ షర్మిల భావించినట్లు తెలుస్తోంది.  ఇటీవలే కొండా దంపతులు అనుచరులతో సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.



 పార్టీ లోకి రావాలి అంటు షర్మిల నుంచి ఆహ్వానం అందింది అయితే వైయస్ షర్మిల పార్టీలోకి వెళ్తే డబ్బు వస్తుంది కాని షర్మిల పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో చేరము. డబ్బు కంటే తనకు విలువలు ముఖ్యం అంటూ కొండా దంపతులు వ్యాఖ్యానించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ఆ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు అయితే గతంలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో బయటకు రావడానికి తాను ఎంతగానో మద్దతు ఇచ్చానని.. తర్వాత తర్వాత బయటికి వచ్చాక జగన్ కనీసం పలకరించలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఏబీసీడీ లు కూడా రాని  మంత్రి ఎర్రబెల్లికి ప్రస్తుతం అవార్డులు వస్తూ ఉండడం విడ్డూరంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కరోనా వైరస్ బారిన పడి చావు అంచుల వరకు వెల్లామని.. అప్పుడు టిఆర్ఎస్ సంబరాలు చేసుకుందని అయితే చంద్రబాబు తోనే పోరాటం చేశామని కేవలం కెసిఆర్ ఎంత అంటూ వ్యాఖ్యానించారు కొండా దంపతులు.  కానీ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగియగానే కొండా దంపతులు షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: