
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కారణంగా మహిళలకు అలంకరించేందుకు అవకాశం లభించడం లేదు. బయటకు వెళ్ళినా.. ఫంక్షన్లలో ఎక్కడైనా మాస్క్ ధరించాల్సిందే. దీంతో మహిళలు లిప్ స్టిక్ వేసుకోవడానికి దూరంగా ఉంటున్నారు. ఇక మరికొందరు మహిళలు మాస్క్ ధరించాల్సి వచ్చినందుకు తమలోని మరో కోణాన్ని బయటకు తీస్తున్నారు. తమ తెలివి ఉపయోగించి మాస్క్ ధరించడంతోపాటు ఆభరణాలను ధరించేస్తున్నారు.
తాజాగా ఓ మహిళ చేసిన పనికి నెటిజన్లు అవాక్కు అయ్యారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసుకుందామా. ఉత్తరాఖండ్ లోని నైనితాల్ జిల్లాలో గోదఖాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తమ సమీప బంధువుల వివాహనికి హజరైంది. ఈ క్రమంలో ఆమె చక్కగా బంగారు ఆభరణాలు ధరించి ఆ పెళ్ళికి వెళ్ళింది. అయితే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనే ఆంక్షలు ఉండడంతో ఆమె మాస్క్ పైనే బంగారు ముక్కు పుడకను పెట్టుకుంది. దీంతో ఆమెను చూసిన వారంత అవాక్కు అవుతున్నారు.
ఇక ఇలా ధరించడం వల్ల తనకు చాలా సౌకర్యవంతంగా ఉందని అలాగే డ్రింక్స్, ఆహారం తీసుకోవడానికి చాలా సులభంగా ఉందని తెలియజేసింది. ఒక వైపు మాస్క్ ధరిస్తూనే.. అలంకరణ కూడా చేసుకోవడంపై ఆమె పై నెటిజన్లు వావ్ అంటున్నారు. ఈ ఫోటోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా ఇప్పుడు ఆ ఫోటో తెగ వైరల్ అవుతుంది. మరీ మీరు ఆ ఫోటో చూసేయ్యండి. ఈ వీడియో చుసిన వారంతా వారి అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.