దేశంపై వరుణుడు పగ పట్టినట్లు భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి..తమిళనాడు లో కూడా గ్యాప్ లేకుండా వానలు కురుస్తున్నాయి.కావేరీ నది పరిసరాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోన్న వర్షాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వర్షాలతో రాష్ట్రం విలవిల్లాడిపోతోంది.మెట్టూరు డ్యాంమ్‌కి డేంజర్ లెవల్‌ వరద వచ్చి చేరుతుంది. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 



రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నాగపట్నం, తిరువారూర్, మైలదుతురై, తంజావూరు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. కావేరీ నది వరద ఉధృతికి పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. ఈరోడ్ నుంచి కర్ణాటకకి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈరోడ్, ధర్మపురి, సేలం జిల్లాలో ఎక్కడిక్కడ రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మెట్టూరు డ్యామ్‌కి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ పూర్తి స్థాయి అవుట్ ఫ్లో కెపాసిటీ 2 లక్షల క్యూసెక్కులు. కానీ కెపాసిటీకి మించి వరద వచ్చే అవకాశం ఉండటంతో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతానికైతే వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. కందన్‌నగర్‌, కావేరినగర్‌, అందియూర్‌ ప్రాంతాల్లో అధికారులు అలెర్టయ్యారు..



పరివాహక ప్రాంతాల్లో సహాయక బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యల్ని తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటవీ ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. సత్యమంగళం అటవీప్రాంతాల్లో గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆందియూర్‌ నుంచి బర్గూరుకు వెళ్ళే రహదారిలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చెన్నై – బెంగుళూరు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. అలాగే, కొండ దిగువ ప్రాంతంలోని దాదాపు 30కి పైగా కొండ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి...ఇంకా రెండు రోజుల పాటు అక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు..



మరింత సమాచారం తెలుసుకోండి: