
అయితే మబ్బుల 4:30 గంటలకు అందుబాటులో ఉండాలని వచ్చిన సమాచారాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆ టైమ్ లో ఎవరూ ఉండరని చర్చించుకున్న ఫ్రెండ్స్.. ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకునేలా ప్లాన్ చేశారు. తీరా అక్కడికి వెళ్లేసరికి మబ్బుల 4 గంటల నుంచే టికెట్ ఖరారైన అభ్యర్థులకు ఎన్టీఆర్ బీఫామ్స్ అందిస్తున్నారని తెలిసింది. నియామతుల్లా వెంటనే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి తన గురించి చెప్పగా.. 'నాలుగున్నరకు రమ్మంటే రెండు గంటలు ఆలస్యంగా రావడమేమిటి బ్రదర్' అంటూ కోప్పడ్డారు. టైమ్ పాటించని వారికి తన దగ్గర స్థానం లేదంటూ తిప్పి పంపించేశారు. ఆ నియోజకవర్గానికి సెకండ్ ప్రయారిటీగా పరిశీలించిన డి.సాంబశివరావు చౌదరి పేరును నియామతుల్లాఖాన్సమక్షంలోనే ప్రకటించి ఆయనకు బీఫామ్ అందజేశారు. ఆ ఎన్నికల్లో సాంబశివరావు చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో టీడీపీ భారీ విజయం సాధించి, ఎన్టీఆర్ సీఎం అయ్యారు. నిర్లక్ష్యంతో టైమ్ కు వెళ్లని కారణంగా ఎమ్యెల్యే అయ్యే చాన్స్ను కోల్పోయానని నియామతుల్లాఖాన్ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం 80 ఏండ్ల వయసున్న ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు