తెలంగాణ మాజీ సీయం కేసిఆర్ గారు ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో వెనకంజు వేయాల్సి వచ్చింది. ఆయన ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఆయన ఎలక్షన్ ఫలితలా తర్వాత ఆయన మీడియా కి దొరికింది ఒక్క సారి మాత్రమే. ఆయన ఆ బాధలో ఉంటే మరలా దానికి తోడు ఇంకో బాధ ఆయన్ని వెంటాడిందనే చెప్పాలి.తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ శుక్రవారం  ఉదయం సోమాజి గూడ యశోదా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జారి పడడంతో కేసీఆర్‌కు తుంటిఎముక విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.ఆయనకు శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. కేసీఆర్ ఆస్పత్రి లో చేరారని తెలియగానే ఆయన అభిమానులు, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు చెప్పారు. మెగాస్టార్‌ చిరంజీవి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ చేశారు. కేసీఆర్‌ సార్‌కు గాయమైందని తెలిసి చాలా బాధ పడ్డాను. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతం కావాలి. త్వరగా కోలుకోవాలి' అని చిరంజీవి ఆకాంక్షించారు.ఇక ల విషయానికి వస్తే..ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీని చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ఘనంగా ప్రారంభమైంది. త్రిష, అనుష్క హీరోయిన్లుగా నటించవచ్చునని వస్తున్నాయి. అలాగే విశ్వంభర అనే టైటిల్‌ను ఖరారు చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: