
ఈ హత్య ఆపరేషన్ సిందూర్ తర్వాత జరగడం గమనపడింది. మే 7, 2025న భారత సైన్యం ఈ ఆపరేషన్లో పాకిస్థాన్లోని లష్కరే తయ్యబా, జైషే మహమ్మద్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ సైఫుల్లాతో సహా లష్కరే నాయకులకు బహిరంగంగా కదలకుండా భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ, సైఫుల్లా హత్య జరిగింది, ఇది పాకిస్థాన్ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
సైఫుల్లా 2000ల ప్రారంభంలో నేపాల్ నుంచి లష్కరే ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించాడు, భారత్లోకి ఉగ్రవాదుల రహస్య ప్రవేశానికి సహకరించాడు. భారత భద్రతా దళాలు అతని నెట్వర్క్ను బహిర్గతం చేసిన తర్వాత, అతను పాకిస్థాన్లోని సింధ్లోని బడిన్ జిల్లాకు మకాం మార్చాడు. అక్కడ అతను లష్కరే, జమాత్-ఉద్-దావా తరపున కొత్త ఉగ్రవాదులను నియమించడం, నిధులు సేకరించడం వంటి కార్యకలాపాలు కొనసాగించాడు. ఈ హత్య వెనుక అంతర్గత విభేదాలు, అంతర్జాతీయ ఒత్తిడి కారణమా అనే చర్చ జరుగుతోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు