కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఇప్పుడు తాజాగా మరొకసారి కూర్చి వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు జరిగిన ఈ సమావేశాలలో టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ లేకుండా చేయడం పైన చాలా తీవ్రస్థాయిలో అక్కడ వివాదాలు నెలకొన్నాయి. అయితే ఈ రోజు సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలను సైతం అధికారులు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తో పాటుగా, అలాగే కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి రాంగోపాల్ రెడ్డి కి చైర్స్ ఏర్పాటు చేశారు. అయితే వీరందరి మధ్యలో మేయర్ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించడం జరిగింది.

ఉదయం 11 గంటలకు ఈ సమావేశం మొదలు కావాల్సి ఉండగా ఆ సమయానికి మీటింగ్ హాల్లో వైసిపి పార్టీకి చెందిన మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లు అక్కడికి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాత్రమే వచ్చి తమ చైర్లో కూర్చోవడం జరిగింది. మరొకవైపుగా మేయర్ తో పాటు 38 వైసీపీ కార్పొరేటర్లతో ఛాంబర్ లో సమావేశమై తమకు తెలియకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడం పైన సురేష్ బాబు అభ్యంతరాన్ని తెలియజేయడం జరిగింది.


మీటింగ్ హాల్లో కాకుండా తన చాంబర్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కమీషనర్ కి లేఖ రాశారు.. దీంతో నిబంధనలకు విరుద్ధంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే మాధవి రెడ్డితో పాటుగా టిడిపి కార్పోరేటర్లు సైతం మేయర్ సురేష్ బాబుని ప్రశ్నిస్తున్నారు. దీంతో అటు ఎమ్మెల్యేలు, ఇటు మేయర్ తో అధికారులు చర్చలు జరిపేలా చూస్తున్నారట. ఇప్పటికే కడపలో అటు మేయర్, ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ విషయం పైన అధికారులు ఎవరికీ ఎవరు సర్ది చెబుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: