భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం.. ఇక్కడ ఎంత టెక్నాలజీ పెరిగినా దేవుళ్లను పూజించడం దేవుళ్లపై నమ్మకం పెట్టుకోవడం మాత్రం అస్సలు మానరు.. ఈ సాంప్రదాయం ఇప్పుడు వచ్చింది కాదు పూర్వకాలం నుంచే మనం పాటిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మన ఇండియాలో దేవుళ్ళ పేరుతో చేసే పండుగలు ఇంకా ఏ దేశంలో చేయరని చెప్పవచ్చు. అలాంటి భారతదేశంలో తెలంగాణలో దేవుళ్ళకి ఇంకా ప్రత్యేకత ఉంటుంది. చెట్టు, పుట్ట, రాయి రప్ప ఇలా అన్నింటిని దేవుళ్ళుగా కొలుస్తారు. ప్రజలు కూడా దేవుళ్లను అత్యంత ప్రీతిపాత్రంగా నమ్ముతారు.. అలాంటి దేవుళ్ళ గుళ్లపై ఏదైనా దాడులు జరిగితే మాత్రం అస్సలు సహించరు.. కానీ ఈ మధ్యకాలంలో  కొంతమంది జనాలు మారిపోయారు. దేవుడి గుళ్ళల్లో హుండీలు దొంగతనాలు చేయడం,విగ్రహాలు ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారు.


అలాంటివి జరిగినా కానీ కనీసం ఏ మీడియా ఛానళ్లు కానీ మెయిన్ పత్రికలు కానీ చూపించడం లేదని చాలామంది హిందూ వాదులు బాధపడుతున్నారు. అయితే తాజాగా మేడ్చల్ లోని హనుమాన్ టెంపుల్ లో  ఆంజనేయ స్వామికి సంబంధించిన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రమే బయటకు వచ్చింది కానీ మెయిన్ మీడియాలో ఎక్కడ కూడా బయటకు రాలేదని హిందుత్వవాదులు ఆందోళన చెందుతున్నారు.

మరి ఈ మీడియా సంస్థలను  కమ్యూనిజ భావజాలం కలిగిన మీడియా సంస్థలనాల లేదంటే డబ్బులకు అమ్ముడుపోయే మీడియా సంస్థలనాల ఏదో అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మైనార్టీలకు సంబంధించిన మసీదులపై ఏదైనా చిన్న దాడి జరిగితే గొంతు చించుకొని పదేపదే చూపించే ఈ మీడియా ఇలా హిందూ దేవుళ్ళపై  దాడులు జరిగితే ఎందుకు చూపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఈ విషయం బయటకు రావడంతో  చాలామంది హిందుత్వవాదులు  ఆ దుండగులను పట్టుకొని శిక్షించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: