రిషబ్ శెట్టి.. ప్రెసెంట్ ఈ పేరు అన్ని ఇండస్ట్రీలోనూ మారమవుతుంది . ఒక్క సినిమాతో పాపులారిటీని తన సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి తాజాగా కాంతారా చాప్టర్ 1 లో కనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు . కాంతారా చాప్టర్ 1 తో భారీ హీట్ అందుకున్న రిషబ్ శెట్టి ప్రజెంట్ తన తదుపరిచిత్రాల పై ఫోకస్ చేస్తున్నాడు . ఇక ఈ మూవీ తో పాన్ ఇండియా మార్కెట్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో . ఈ సినిమా ఏకంగా 710 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది .


ఇక థియేటర్లలో ప్రజెంట్ కూడా ఆడుతూనే ఉంది . ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం కు వెళ్లడం జరిగింది రిషబ్ శెట్టి . ఇక ఇందులో మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రిషబ్ శెట్టి .. కేబీసీ షో ద్వారా మొత్తం 12.50 లక్షల ను గలుచుకోవడం జరిగింది . ఈ డబ్బు ఏం చేస్తారు అని అమితా ప్రశ్నించడం కూడా జరిగింది . ఇక దానికి ఈ హీరో సమాధానం ఇస్తూ.. " నేను విశ్వబ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నాను .


ఈ డబ్బు ద్వారా నా ఫౌండేషన్ తో ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేస్తాను . వసతులు ఏర్పాటు చేస్తాను . అలాగే దైవ నర్తకులకు సాయం చేస్తాను " అంటూ రిషబ్ వెల్లడించాడు . ఇక అతని సమాధానానికి అమితాబ్ మెచ్చుకోవడం జరిగింది .  మీ సమాధానం నాకు బాగా నచ్చింది . మీకు ఈ డబ్బుతో పాటు బైక్ కూడా ఇస్తాను అంటూ వెల్లడించాడు ‌. ఇక ఆ మాటలకు రిషబ్ ట్యాంక్స్ కూడా తెలిపాడు . ప్రజెంట్ వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: