ప్రేమకు, శృంగారానికి సరైన టైం ఉంటుంది. ఆ టైంలో చాలా గోప్యంగా ఉండేలా ఇవి చేసుకుంటేనే మజా ఉంటుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కొన్ని శతాబ్దాలుగా, ప్రేమ అయినా, శృంగారం అయినా మూడో కంటికి తెలియకుండానే ఉంటాయి. అయితే ఈ మోడ్రన్ కల్చరల్ అలవాటు అయ్యాక సమాజంలో వేళ కళ్లు మనలను గమనిస్తున్నా మనం మాత్రం ప్రేమలోనూ, చాటుమాటు కార్యకలాపాల్లోనూ ముగిపోతున్నాం. ఇదంతా పాశ్యాత్య సంస్కతి వల్లే వచ్చిందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఈ క్రమంలోనే బహిరంగంగా ఓ బ్రిడ్జిపై ప్రేమ కార్యకలాపాల్లో మునిగిపోయి తమను తాము మరిచిపోయిన ఓ జంట ప్రాణాలు కోల్పోయింది. గాడమైన ముద్దులతో ఒకరినొకరు ముంచెత్తుకుంటున్న టైంలో వాళ్లు ఎలా ప్రాణాలు కోల్పాయారన్నది వినడానికి కాస్త విచిత్రంగానే ఉంటుంది. అసలు మ్యాటర్లోకి వెళితే పెరు దేశానికి చెందిన భార్యాభర్తలు ఎస్పినోజ్ (34), హెక్టర్ విడాల్ (36) ఊహించని విధంగా విగత జీవులయ్యారు.
పెరు దేశంలోని బెత్లెహాం నగరంలోని ఓ బ్రిడ్జిపై ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. స్వతహాగా పర్వతారోహకులు అయిన ఈ జంట టూరిస్ట్ గైడ్లుగా పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే క్యూసో పట్టణంలో పని ముగించుకున్న ఈ దంపతులు ఇంటికి వెళుతుండగా రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బెత్లెహాం బ్రిడ్జిపై కాసేపు ఆగారు.
ఇద్దరికి ఒక్కసారిగా మూడ్ వచ్చేసింది. వెంటనే ముద్దుల్లో మునిగిపోయారు. ఆ సమయంలో ఎస్పినోజ్ తన భర్త విడాల్ను దగ్గరగా లాక్కునేందుకు యత్నించింది. అయితే, ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ రక్షణ గోడపై నుంచి కిందకు పడిపోయారు. వీరు పై నుంచి 50 మీటర్ల కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఎస్పినోజ్ మార్గమధ్యంలో చనిపోగా, విడాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.