ఇటీవలె రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టి-20 సిరీస్ ఆరంభించింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేసే సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్ రోహిత్ శర్మ కు జోడీగా తీసుకువచ్చారు. అయితే టీమిండియా చేసిన ఈ ప్రయోగం పై అటు మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే గత కొంత కాలం నుంచి ఓపెనర్లను వరుసగా మారుస్తూ వస్తూనే వస్తుంది బిసిసిఐ. ఇక ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ రోహిత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు మహమ్మద్ కైఫ్.
సూర్య కుమార్ యాదవ్ ను ఓపెనింగ్లో పంపించడం నాకైతే అసలు అర్థం కాలేదు. రిషబ్ పంత్ ను ఓపెనర్గా దించాలని రెండు మ్యాచ్ లలో అవకాశమిచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. ఇక మొదటి మ్యాచ్లో కూడా అతనే రోహిత్ తో పాటు ఓపెనర్గా పంపించాల్సింది. కనీసం అతనికి 5,6 అవకాశాలు ఇవ్వకుండా ఓపెనర్ గా రిషబ్ పంత్ ని పక్కనపెట్టి సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ పంపించారు. మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాట్స్మెన్. ఈ విషయంలో రోహిత్ బుద్ధి తక్కువ పనిచేసాడు అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించాడు మహ్మద్ కైఫ్. ఇక కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ చేసిన ఈ ప్రయోగం అత్యంత చెత్తది అని అంటూ వ్యాఖ్యానించాడు.