ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలు కూడా అధునాతన టెక్నాలజీ ల తో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తాజాగా 100 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని ప్రస్తుతం చైనాలో లాంచ్ చేసింది. ఇక త్వరలోనే ఈ టీవీని భారత మార్కెట్లోకి కూడా తీసుకురానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ టీవీ వంద అంగుళాల తో పాటు ఫోర్ కే స్క్రీన్ తో అందించనున్నారు. ఇక దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 Hz రిఫ్రెష్ రేటుతో ఫీచర్ కూడా ఇందులో కల్పించడం ముఖ్య గమనార్హం. ఇక డాల్బీ డిజిటల్ ప్లస్ తో పాటు హెచ్ డి టెన్ ప్లస్ సపోర్టు కూడా ఈ స్మార్ట్ టీవీ లో అందించడం విశేషం. డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో పాటు డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా ఇందులో అందించారు.
ఇక ఈ టీవీ ధర ప్రస్తుతం 19,900 యువాన్ లు గా నిర్ణయించారు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.2,39,500.. ఇకపోతే బ్లాక్ కలర్ ఆప్షన్లో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే చైనాలో దీనికి సంబంధించి ప్రీ బుకింగ్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.. రెడ్మీ మాక్స్ 86 అంగుళాల మ్యాక్స్ టీవీ చైనాలో 7,999 యువాన్ కాగా  పోయిన సంవత్సరం లాంచ్ చేశారు . ఇక భారత కరెన్సీ ప్రకారం 95,700 రూపాయలు.


రెడ్మీ మాక్స్ 100 ఇంచెస్ టీవీ స్పెసిఫికేషన్ అలాగే ఫీచర్ విషయానికొస్తే.. 4GB ర్యామ్ ,  64GB  స్టోరేజ్ తో వీటిని అందుబాటులోకి ఉంచారు. డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ఫియర్ సపోర్ట్ లతోపాటు వైఫై సిక్స్, 30 watt స్పీకర్స్, రెండు యూఎస్బీ పోర్టులు, 1 ఎథర్ నెట్ పోర్టు కూడా ఇందులో కల్పించడం గమనార్హం. ఎం ఐ యు ఐ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది అని కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: