చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.పాము కాటుల అందరిని కాటు వేస్తుంది.ఇక ఈ నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ పెట్టుకొని వేగంగా కరోనా నుంచి కోలుకున్నాయి. అలా చాలా దేశాలు మహమ్మారి నుంచి కోలుకున్నాయి. ఇక తాజాగా స్పెయిన్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గడంతో పట్టడంతో లాక్‌డౌన్ ఎత్తేశారు. సుమారు ఆరు నెలలు నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. ఈ సమాచారం తెలియగానే ఆనందంలో మునిగిపోయారు. వీధుల్లోకి వచ్చి చిందులేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఇక స్పెయిన్‌లో గత ఏడాది అక్టోబరు నెల నుంచి లాక్‌డౌన్ నిబంధనలు దశలవారీగా అమల్లోకి వచ్చాయి. ఇటీవల కొన్ని షరతులతో లాక్‌డౌన్‌కు సడలింపు విధించారు. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ దేశంలో కొన్ని నెలల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగించారు. ఫలితంగా వైరస్ బాధితుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. వైరస్ కూడా దాదాపు కనుమరుగైంది.

ఇక లాక్ డౌన్ ఎత్తేసిన సందర్బంగా కొన్ని జంటలు వీధుల్లోకి వచ్చి ముద్దులు పెట్టుకుంటూ సంబరాలు చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరైతే మాస్కులు లేకుండానే వీధుల్లోకి వచ్చారు. బర్సిలోనాలో బీచ్‌లు జనాలతో కిక్కిరిశాయి. కొన్ని నెలలుగా మూతపడిన బార్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకున్నాయి. రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, స్పెయిన్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాత్రం ఇంకా లాక్‌డౌన్ కొనసాగుతోంది. బాలేరిక్ ఐలాండ్, క్యానరీ ఐలాండ్, నవర్రా, వాలెన్సియా ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది.ఇక ఇండియాలో కూడా రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. రోజుకి దాదాపు 4 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.ఇక స్పెయిన్ తరహాలోనే ఇండియాలో కూడా కరోనా అంతమయ్యి సంబరాలు జరగాలని దేవుణ్ణి వేడుకుందాం..



మరింత సమాచారం తెలుసుకోండి: