అడవిలో ఎంతో వేగంగా వేటాడే జంతువుల్లో చిరుతపులులు ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో అయితే అడవుల్లో ఉండే చిరుతపులులు అటు జనావాసాల్లోకి కూడా వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మనుషులు అడవులను నరికి నగరాలను నిర్మిస్తున్న నేపథ్యంలో చివరికి ఎక్కడ బ్రతకాలో తెలియక  ఆహారం దొరకక చిరుతపులులు జనావాసాల్లోకి వస్తూ అందరిని భయపెడుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలు. ఇలా పలు గ్రామాల్లో కి వచ్చిన చిరుతపులులు ప్రజల పై దాడి చేసిన ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం.



 అయితే ఇలాంటి క్రూరమైన చిరుతపులి కి మనిషికి మధ్య సంఘర్షణల వార్తలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. కానీ మనిషి చిరుతపులి మధ్య స్నేహం అంటే దాదాపు అసాధ్యం అని చెబుతారు ఎవరైనా. కానీ ఇలా మనుషుల్లో ఉన్న ఒక భావన తప్పు అని నిరూపించాడు ఇక్కడ ఒక వ్యక్తి. సాధారణంగా చిరుతపులులు చూస్తే ఎవరైనా సరే ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉంటారు.  ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా చిరుతపులులతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఎంతలా అంటే తాను నిద్రపోతున్న సమయంలో ఏకంగా చిరుత పులి ని దగ్గరికి తీసుకుని చంటి పిల్లాడిని అదిమి పెట్టినట్లుగా అదుముకుని మరి పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.


 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఇక ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో చూసుకుంటే.. ఒక వ్యక్తి ఆరుబయట నిద్రిస్తున్నాడు. ఇక ఆ వ్యక్తి ఏకంగా 3 చిరుతపులులు చుట్టిముట్టినట్లు కనిపిస్తోంది. ఇక ఇందులో ఒకటి ఏకంగా అతని ఒడిలో కి వెళ్లి పడుకుంది. ఇక కొన్ని సెకండ్ల తర్వాత మిగతా చిరుతపులులు కూడా మొదటి చిరుత లాగానే అతనికి దగ్గరగా వెళ్ళి పట్టుకుంటాయి.  చిరుతపులిని చూసి అతను భయపడకుండా వాటిని ఏకంగా జోలపాడుతూ హాయిగా నిద్ర పుచ్చుతు ఉంటాడు సదరువ్యక్తి. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: