
ఇలాంటి మూమెంట్లోనే మరొక ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది అన్న వార్త బయటకు వచ్చింది . తాజాగా ముంబై నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమామానం మూడు గంటల ప్రయాణం తర్వాత మళ్లీ తిరిగి వెనక్కి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు . అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ సిచువేషన్ నెలకొంది . అందుతున్న వివరాల ప్రకారం ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఎంత ఉధృత వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే .
ఇరాన్ - ఇజ్రాయిల్ దాడుతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది . ఇజ్రాయిల్ వైమానిక దాడుల కారణంగా గగన తలంపై కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి . ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం సుమారు 5:39 నిమిషాలకు ముంబై నుంచి లండన్ కు బయలుదేరింది ఎయిర్ ఇండియా విమానం . అయితే ఈ ఎయిర్ ఇండియా విమానం మూడు గంటల ప్రయాణం తర్వాత రాడర్ లో సిగ్నల్ సమస్య తలెత్తిన కారణంగా తిరిగి విమానం వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడర్ 24 ద్వారా ఈ విషయం నిర్ధారణ అయింది . అయితే రాడర్ సిగ్నల్ సమస్య కారణంగా విమానం వెనక్కి రావడం ఒక భారీ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగినట్టయింది. రాడర్ సమస్య కారణంగా విమానం వెనక్కి మళ్లించినట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు ప్రయాణికులంత సురక్షితంగా సేఫ్గా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . విమానం తిరిగి వస్తుందని తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు - బంధువులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది ..? అనే విషయంపై ఆరాతీస్తున్నారు..!!
Air india flight AIC129, which took off early morning today from mumbai for london, is returning to mumbai, according to Flightradar24. More details are awaited. pic.twitter.com/BmRtlkmaut
— press Trust of india (@PTI_News) June 13, 2025