నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే . లండన్ బయలుదేరిన విమానం కేవలం 32 సెకండ్లలోనే కుప్పకూలిపోయింది.  ఈ ఘటనలో 241 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు . కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు . అది కూడా 11 ఆ సీట్ పుణ్యం కారణంగా అన్న విషయం బయటపడింది.  ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అదే విధంగా అమిత్ షా అందరూ కూడా దగ్గరుండి ఏం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు .


ఇలాంటి మూమెంట్లోనే  మరొక ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది అన్న వార్త బయటకు వచ్చింది . తాజాగా ముంబై నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమామానం మూడు గంటల ప్రయాణం తర్వాత మళ్లీ తిరిగి వెనక్కి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు . అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ సిచువేషన్ నెలకొంది . అందుతున్న వివరాల ప్రకారం ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఎంత ఉధృత వాతావరణం  నెలకొందో అందరికీ తెలిసిందే .



ఇరాన్ - ఇజ్రాయిల్ దాడుతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది . ఇజ్రాయిల్ వైమానిక దాడుల కారణంగా గగన తలంపై కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి . ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం సుమారు 5:39 నిమిషాలకు ముంబై నుంచి లండన్ కు బయలుదేరింది ఎయిర్ ఇండియా విమానం . అయితే ఈ ఎయిర్ ఇండియా విమానం మూడు గంటల ప్రయాణం తర్వాత రాడర్ లో సిగ్నల్ సమస్య తలెత్తిన కారణంగా తిరిగి విమానం వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడర్ 24 ద్వారా ఈ విషయం నిర్ధారణ అయింది . అయితే రాడర్ సిగ్నల్ సమస్య కారణంగా విమానం వెనక్కి రావడం ఒక భారీ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగినట్టయింది.  రాడర్ సమస్య కారణంగా విమానం వెనక్కి మళ్లించినట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు ప్రయాణికులంత సురక్షితంగా సేఫ్గా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . విమానం తిరిగి వస్తుందని తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు - బంధువులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది ..? అనే విషయంపై ఆరాతీస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: