దేశ వ్యాప్తంగా అత్యధిక౦గా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే ఉన్నాయి. రోజు రోజుకి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా ఉన్నాయి. దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే 50 డిగ్రీల వరకు నమోదు కావడం గమనార్హం. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. 

 

ఇక ఇదిలా ఉంటే దేశంలో ఒక చోట 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. చురులో గరిష్ట ఉష్ణోగ్రత 50  డిగ్రీలుగా నమోదైందని తెలిపారు. ఇది దేశంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రవీంద్ర సిహాగ అనే భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: