మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు అక్రమాస్తుల కేసులో ఒక్కొక్కరిగా బినామీల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ మేరకు సికింద్రాబాద్​ బొల్లారం సదర్​బజార్​లో అతని బినామీ ఇంటిని ఏసీబీ అధికారులు గుర్తించారు. నందగోపాల్​, నాగరాజు ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారని.. నందగోపాల్​ సోదరుడు మహేందర్​ ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్నట్లు అనిశా డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.


కీసర ఎమ్మార్వో నాగరాజుతో నందగోపాల్​ మహేందర్​కు సత్సంబంధాలు ఉండేవని.. మహేందర్​ లాకర్​ను ఎమ్మార్వో, అతని భార్య స్వప్న పలుమార్లు ఉపయోగించుకునేవారని ఒప్పుకున్నట్లు పోలీసులు వివరించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి లాకర్​ను తెరిచి అందులో ఉన్న ఆస్తికి సంబంధించిన వివరాలను తెలిసుకునే ప్రయత్నం చేస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: