త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకు గానూ టీం ఇండియాను ప్రకటించారు. సునీల్ జోషీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నిన్న సమావేశం అయి జట్టుని ఎంపిక చేసింది. టెస్ట్, వన్డే, టీ 20 జట్లను ప్రకటించింది. అయితే ఒక ఆటగాడిని మాత్రం ఇప్పుడు ఎంపిక చేయలేదు. ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ని జట్టుకి ఎంపిక చేయలేదు. ఐపిఎల్ లో గత 3 సీజన్ల నుంచి కూడా చాలా బాగా ఆడుతున్నాడు.

అయినా సరే అతన్ని ఎంపిక చేయలేదు. దీనిపై సూర్యకుమార్ యాదవ్ కామెంట్ ఒకటి వైరల్ అవుతుంది. “భారత జట్టు ప్రకటించినప్పుడల్లా నా తండ్రి అన్ని వెబ్‌ సైట్‌ లను తనిఖీ చేస్తారు. వాటిని చూసిన వెంటనే నన్ను పిలిచి, 'నీ పేరు లేదు' అని నాకు చెప్తాడు. నేను అతనికి 'అది సమస్య కాదు' అని చెప్తాను.” అని చెప్పినట్టు కామెంట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: