ఐపీఎల్‌ చరిత్రలోనే కొత్త రికార్డ్‌ నమోదైంది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ అదరగొట్టింది. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదయ్యింది. ఐపీఎల్‌ చరిత్రలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యధిక స్కోరు నమోదు చేసింది. ముంబయి బౌలర్లపై విరుచుకు పడిన హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఏకంగా 277 పరులుగు చేసేశారు. ఇప్పటి వరకు బెంగళూరు పేరిట ఉన్న 263 పరుగుల రికార్డును హైదరాబాద్‌ జట్టు అధిగమించేసింది.

బ్యాటింగ్‌లో అదరగొట్టిన హైదరాబాద్‌.. ముంబయి ముందు  278 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. హైదరాబాద్‌ స్కోరు 277/3 కాగా.. హైదరాబాద్‌ బ్యాటింగ్‌ లో క్లాసెన్‌ 80, అభిషేక్‌ శర్మ 63 పరుగులు చేశారు. హెడ్‌ 62, మార్క్రమ్‌ 42లతో అలరించారు. మరి గతంలోనూ చక్కటి స్కోర్లు చేసినా విజయం విషయంలో హైదరాబాద్‌కు అంతగా అదృష్టం కలసి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl